Friday, April 19, 2024

పనుల్లో వేగం పెంచాలి : పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం పెద్దపల్లి పట్టణంలోని 19,20 వార్డుల్లో నిర్మాణమవుతున్న డ్రైనేజీలు, సీసీ రోడ్లను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని, పనుల్లో కచ్చితమైన నాణ్యత పాటించాలన్నారు. వార్డ్ లో తిరుగుతున్నప్పుడు ప్రజలు వారికి ఉన్నటువంటి సమస్యలు చెప్పగా వాటి అన్నింటినీ నమోదు చేసుకొని మున్సిపల్ అధికారులు వెంటనే పరిష్కరిచాలన్నారు. సమస్యల సత్వర పరష్కారానికి వార్డ్ సందర్శన చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తిరుపతి, కౌన్సిలర్లు తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement