Friday, April 19, 2024

రైతన్నలకు న‌ష్ట‌పరిహారం అందిస్తాం.. ఎమ్మెల్యే దాసరి

అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందిస్తామని, రైతన్నలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తెలియజేశారు. వడగళ్ల వర్షానికి ఓదెల మండలం గోపరపల్లి గ్రామంలో దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను పరిశీలించి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయ అధికారులు పంట నష్టంపై యుద్ధ ప్రాతిపదికన నివేదిక అందించాలని ఆదేశించామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మెడికల్ కార్పొరేషన్ ఛైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎంపీపీ కునారపు రేణుకాదేవి, రైతు సమితి మండలాధ్యక్షుడు కావేటి రాజు, సర్పంచ్ కర్క మల్లారెడ్డి, ఎంపీటీసీ లావణ్య-నారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement