Tuesday, April 23, 2024

నీటి సమస్యపై తహసీల్దార్‌కు వినతి..

ఎల్లారెడ్డిపేట: మండలంలోని కోరుట్లపేట గ్రామ ప్రజలు నీటి సమస్యపై పేనంమడుగు నీరు పంపకం విషయంపై తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. కోరుట్లపేట, సింగారం గ్రామాల మధ్య నీటి పంపిణీ సమానంగా జరిగేలా చూడాలని కోరారు. రాత్రి సమయాల్లో కోరుట్లపేటకు నీరు రాకుండా చెక్కలు, ఇసుక సంచులు అడ్డువేస్తున్నారని, రెండు గ్రామాలకు ఒకేలా న్యాయం చేయాలని విన్నవించారు. తమ గ్రామాల రైతులకు కూడా నీటి సమస్య ఉందని, పొలాలు ఎండిపోతున్నాయని వివరించారు. ఇప్పటికైనా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో పోచయ్య, రాంరెడ్డి, లింగమూర్తి, వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్‌, బాలరాజు, ఎల్లయ్య, రాజు, దామోదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement