Wednesday, April 24, 2024

ఉపాధి పనుల్లో భౌతిక దూరం..

పెద్దపల్లిరూరల్‌: కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో ఉపాది కూలీలు భౌతిక దూరం పాటిస్తూ ఉపాధి పనులు నిర్వహించాలని మండలంలోని కాపులపల్లి గ్రామ సర్పంచ్‌ గోపు కవిత శ్రీనివాస్‌ పేర్కొన్నారు. గ్రామంలో నిర్వహించిన ఉపాధి హామీ పనుల్లో భాగంగా కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో ఉపసర్పంచ్‌ అశోక్‌, కార్యదర్శి శ్యామ్‌, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement