Wednesday, April 24, 2024

ఉపాధిహామీ పనులు..

ఎల్లారెడ్డిపేట: మండలంలోని బుగ్గ రాజేశ్వర తండా గ్రామంలో ఉపాధి హామీ పనులను ఎంపీపీ పిల్లి రేణుక, సర్పంచ్‌ అజ్మీర రజిత ప్రారంభించారు. ఈసందర్భంగా ఉపాధిహామీ కూలీలతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పనికి వచ్చేలా చూడాలని కార్యదర్శి సరియాకు సూచించారు. పనికి వచ్చే వారు ఎండ ఎక్కువగా ఉండడంతో తమ వెంట నీళ్ల బాటిల్‌లు తెచ్చుకోవాలన్నారు. అలాగే సర్పంచ్‌తో కలిసి ఎంపీపీ స్మశాన వాటిక, పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. ఈకార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు పిల్లి కిషన్‌, టిఆర్‌ఎస్‌ ఎస్టీసెల్‌ మండల అధ్యక్షులు అజ్మీర తిరుపతి నాయక్‌, వార్డు సభ్యులు రెడ్డి నాయక్‌, నాయకులు దేవేందర్‌, శ్రీనివాస్‌, రాములు, నరేష్‌, పద్మ, రమేష్‌, ఉపాధి పనులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement