Tuesday, April 23, 2024

వెంకటేశ్వర బ్రహ్మోత్సవాల్లో డైరెక్టర్‌ దంపతులు..

యైటింక్లయిన్‌కాలనీ: 8వకాలనీలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సంస్థ డైరెక్టర్‌ ఓపీ, పా చంద్రశేఖర్‌, పల్లవి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు జగన్నాథ చార్యుల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన భేరీపూజ, డోలోత్సవం, గరుడ సేవలతోపాటు ప్రత్యేక పూజల కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం స్వామి వారు గరుడ వాహనంపై కాలనీ వీధుల గుండా నిర్వహించిన ఊరేగింపులో కోలాట బృందాలు, చిరుతల రామాయణ బృందాల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈకార్యక్రమంలో అధికారులు సాంబయ్య, శ్రీనివాస్‌, సురేందర్‌, సూర్యకుమార్‌, రాధాకృష్ణారావు, రామకృష్ణ, చంద్రమౌళి, పీవీ రమణ, రాధాకృష్ణ, స్వామిలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement