Tuesday, April 16, 2024

వలస కూలీ ఆత్మహత్య..

దరిపల్లి : మండలంలోని గొల్లపల్లి గ్రామానికి వలస వచ్చి కూలీ పనులు చేసి బ్రతుకుతున్న దరిపల్లి గ్రామానికి చెందిన సంపంగి మల్లేశం అనే వ్యక్తి ఆర్థిక బాధలు భరించలేక జీవితం పై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామ సర్పంచ్‌ పాశం సరోజన దేవరెడ్డి తెలిపారు. తాను నివసిస్తున్న ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందినట్లు తెలిపారు.మృత దేహం పోస్ట్‌ మార్టం కొరకు సర్పంచ్‌ వెయ్యి రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.దాతలు ఎవరయినా మృతుని కుటుంబానికి ఆర్థికసాయం అందించాలని సర్పంచ్‌ కోరారు.మృత దేహానికి స్థానిక పోలీసులు శవ పంచనామా జరిపి మృతదేహాన్ని సిరిసిల్ల ప్రాంతీయ వైద్య శాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement