Tuesday, April 16, 2024

గ్రావిటీ కెనాల్ లో గుర్తు తెలియని మృతదేహం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. అన్నారం గ్రామపంచాయతీ పరిధిలోని దుబ్బగూడెం సమీపంలో ఉన్న గ్రావిటీ కెనాల్ లో గుర్తుతెలియని మహిళ మృతదేహం బుధవారం లభ్యమైంది. వివరాల్లోకి వెళితే.. దుబ్బగూడెం కాలనీ వాసులు గ్రావిటీ కెనాల్ సమీపంలో స్థానికులు అటువైపు వెళ్లగా నీటిలో దుస్తులు లేకుండా తేలియాడుతున్న మహిళ మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే కాళేశ్వరం పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి కాలేశ్వరం పోలీసులు చేరుకొని పరిశీలించారు. మహిళ ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైన హత్య చేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement