Wednesday, April 24, 2024

కొడుకు ఆత్మహత్యను తట్టుకోలేక.. తల్లి మృతి

తిమ్మాపూర్ ప్రభ న్యూస్.. ఏడాది క్రితం భార్య చనిపోవడంతో ఒంటరిగా జీవనం గడుపుతున్న ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా.. కొడుకు మృతిని జీర్ణించుకోలేని తల్లి తనయుడి వెంటే పరలోకాలనికి చేరింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరు గ్రామానికి చెందిన శ్యామ్ సుందర్(35) ఆర్కెస్ట్రా గాయకుడిగా జీవనం సాగిస్తున్నాడు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు చెందిన శారదతో ఏడాది క్రితం వివాహం జరిగింది. దాదాపు ఏడు నెలల క్రితం శారద హుస్నాబాద్ లోని ఓ బహిరంగ ప్రదేశంలో చెట్టుకు ఉరేసుకొని చనిపోయింది. భార్య ఎడబాటును తట్టుకోలేని భర్త శ్యాంసుందర్ తన పెళ్లి రోజునే అతని భార్య ఉరివేసుకొని చనిపోయిన చెట్టు దగ్గరికి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. శ్యాంసుందర్ ఆత్మహత్యని అతడి తల్లి కనకలక్ష్మి తట్టుకోలేకపోయింది. కొడుకు అంత్యక్రియలు నిర్వహించిన అనంతరం రాత్రిపూట ఆమెకు చాతిలో నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. ఒకే కుటుంబంలో తల్లి కొడుకులు మృతి చెందిన ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. తల్లి కొడుకులు 24 గంటల్లోపే ఒకరి తర్వాత మరొకరు చనిపోవడంతో గ్రామమంతా దుఖసాగరంలో మునిగిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement