Thursday, April 25, 2024

విద్యుదాఘాతంతో ఇద్ద‌రు మృతి

రాజ‌న్న సిరిసిల్ల : గ‌డ్డివాముపై మంట‌ల‌ను ఆర్పే క్ర‌మంలో వీర్ణపల్లి మండలంలోని ఎర్రగడ్డ తండాకు చెందిన బానోతు రవి, బానోతు నీల విద్యుదాఘాతంతో దుర్మరణం చెందారు. వివ‌రాల్లోకి వెళితే.. వారి ఇంటి పరిసర ప్రాంతంలో 11 కేవి విద్యుత్ తీగ తెగి పశువుల కొరకు ఏర్పాటు చేసుకున్న పశుగ్రాసం పై పడింది. దీంతో గడ్డివాము దగ్దం కావడం చూసి మంటలు అర్పే ప్రయత్నంలో నీళ్ళు పోయడంతో ఇద్దరూ విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. రవి ఎర్రగడ్డ తండా గ్రామ పంచాయతీలో కార్మికునిగా పని చేస్తున్నట్లు తెలిసింది. మృతులకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం మూలంగానే గిరిజన రైతులు మృతి చెందారని ఆరోపిస్తూ గ్రామస్థులు విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement