Friday, March 29, 2024

కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్ పార్టీ : ఎమ్మెల్యే అరూరి

వర్దన్నపేట : కార్యకర్తలను కంటికిరెప్పలా కాపాడుకుంటామ‌ని, టీఆరెఎస్ పార్టీ అండగా ఉంటుంద‌ని, ప్రమాద వశాత్తు మరణించిన కార్యకర్తల కుటుంబాలకు 2 లక్షల ప్రమాద భీమా అందించ‌డం జ‌రుగుతుంద‌ని టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. వర్దన్నపేట మండలం దివిటిపల్లి గ్రామానికి చెందిన కునూరు యాదగిరి ఎలుగుబంటి దాడిలో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులైన నాగలక్ష్మి గారికి రూ.2 లక్షల రూపాయల పార్టీ ఇన్సూరెన్స్ చెక్కును, కొత్తపల్లి గ్రామానికి చెందిన జన్ను సంతోష్ ఇటీవల ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులైన కవితకి రూ.2 లక్షల పార్టీ ఇన్సూరెన్స్ చెక్కును ఎమ్మెల్యే అరూరి రమేష్ స్వయంగా ఇంటికి వెళ్లి బాధిత కుటంబాలకు అందజేశారు.

ఈ సందర్బంగా క్రియాశీల సభ్యత్వం ద్వారా 2లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్కును అందచేసిన ఎమ్మెల్యే అరూరి రమేష్ కి, ముఖ్యమంత్రి కేసీఆర్ కి బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి అన్నమనేని అప్పారావు, జడ్పిటీసి మార్గం బిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్ రాజేష్ కన్నా, వర్దన్నపేట మార్కెట్ కమిటీ చైర్మన్ స్వామి రాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు తూళ్ళ కుమారస్వామి, స్థానిక, మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement