Monday, April 15, 2024

మండల నేతల ప్రచారం..

ఎల్లారెడ్డిపేట: నాగార్జున సాగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఎల్లారెడ్డి పేట మండల టిఆర్‌ఎస్‌ నాయకులు ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. మండలం నుండి పలువురు నాయకులు నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల్లో ప్రచారానికి గత వారం క్రితం తరలి వెళ్లిన నాయకులు త్రిపురారమ్‌ మండలంలోని పలు గ్రామాలలో ప్రచారంలో పాల్గొని టి ఆర్‌ ఎస్‌ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నారు. టిఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు వివరిస్తూ టిఆర్ ఎస్ అభ్యర్థికి ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. ప్రచారంలో జిల్లా పార్టీ ఇంఛార్జి తోట ఆగయ్య, జెడ్పీటీసీ చీటీ లక్ష్మణ్‌రావు, ఏఎంసీ చైర్మెన్‌ కొండ రమేష్‌, పిఏసీఎస్‌ చైర్మెన్‌ కృష్ణరెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు కొండాపురం బాల్‌రెడ్డి, వర్స కృష్ణాహరి, మల్లేశంతో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement