Sunday, April 14, 2024

హుజురాబాద్ లో టీఆర్ఎస్ కే ఓటు.. దళితులతో ప్రమాణం చేయించిన నేతలు

హుజూరాబాద్ నియోజకవర్గంలో ఓట్ల కోసం అధికార టీఆర్ఎస్ పార్టీ దిగజారుడు రాజకీయాలు చేస్తోంది. దళితుల ఓట్ల కోసం కుటిల ప్రయత్నాలు చేస్తోంది. ఏకంగా టీఆర్ఎస్ కు ఓటు వేయాలని కొన్ని దళిత కుటుంబాలతో అధికార పార్టీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి ప్రతిజ్ఞ చేయించారు. కమలాపూర్ మండలం గూడూరులో మాల సామాజిక వర్గానికి చెందిన వారితో  ప్రమాణం చేయించారు. టీఆర్ఎస్ కే ఓటు వేయాలని చేతులు చాచి మరీ శపథం చేయించారు. అంతేకాదు కేసీఆర్ తెలంగాణ జాతిపిత అని వారినోట పలికించారు. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరికొన్ని గ్రామాల్లోనూ ఇదే విధంగా టీఆర్ఎస్ నాయకులు ప్రతిజ్ఞలు చేయిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకుండానే దిగజారుడుగా వ్యవహరిస్తున్నారని ప్రజాస్వామ్య వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళితులతో ప్రమాణం చేయించడంపై దళిత మేధావుల మండిపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement