Friday, April 19, 2024

ఆరుగురు ఇన్ స్పెక్టర్ల బదిలీ..

మల్టీ జోన్ పరిధిలో పనిచేస్తున్న ఆరుగురు ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ మల్టీ జోన్ వన్ ఐజి చంద్రశేఖర్ రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీరాంపూర్ మహిళా పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న బుక్క శ్రీనివాస్ ను నిర్మల్ రూరల్ సర్కిల్ కు, ఆదిలాబాద్ ట్రాఫిక్ పిఎస్ లో పనిచేస్తున్న కొంక మల్లేష్ ను నిర్మల్ టౌన్ కు, రామగుండం సిసిఆర్బిలో పనిచేస్తున్న రాజ్ కుమార్ గౌడ్ ను బెల్లంపల్లి రూరల్ సర్కిల్ కు, నిర్మల్ రూరల్ సర్కిల్ లో పనిచేస్తున్న వెంకటేష్ ను మల్టీ జోన్ వన్ కార్యాలయానికి, నిర్మల్ టౌన్ పిఎస్ లో పనిచేస్తున్న నాగపురి శ్రీనివాస్ ను మల్టీ జోన్ వన్ కార్యాలయానికి, బెల్లంపల్లి రూరల్ లో పనిచేస్తున్న బాబురావును రామగుండం సిసిఆర్బికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement