Friday, March 29, 2024

సబ్బితం జలపాతం వద్ద విషాదం.. నీటిలో మునిగి వలస కార్మికుడి మృతి

పెద్దపెల్లి జిల్లాలోని సబితం జలపాతం వద్ద విషాదం చోటుచేసుకుంది. ఈరోజు జలపాతం వద్దకు వెళ్లిన రాజస్థాన్ కు చెందిన వలస కార్మికుడు నీటిలో మునిగి మృతిచెందాడు. 18 మంది వరస కార్మికులు జలపాతం చూసేందుకు వెళ్లి స్నానాలు చేస్తుండగా రాజస్థాన్ కు చెందిన సర్వన్ (25) నీటిలో మునిగి మృతిచెందినట్లు స్థానికులు పేర్కొన్నారు. సర్వన్ పొట్టకూటి కోసం పెద్దపల్లిలో రేలింగ్ పనులు నిర్వహిస్తున్నాడని స్నేహితులు తెలిపారు. సమాచారం అందుకున్న బసంత నగర్ ఎస్ఐ మహేందర్ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement