Wednesday, March 27, 2024

వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఉండొద్దు.. సీపీ చంద్రశేఖర్ రెడ్డి

రామగుండం : భారీ వర్షాల వల్ల రాజీవ్ రహదారిపై వరద నీరు ప్రవహిస్తుందని, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశించారు. సోమవారం రంగంపల్లి వద్ద రాజీవ్ రహదారిపై ప్రవహిస్తున్న వరద నీటిని పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. రెండు రోజులుగా పెద్దపల్లి పోలీసులు 24 గంటల పాటు వాహనదారులకు ఇబ్బందులు లేకుండా పట్టిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు అన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్, ఆర్ అండ్ బి అధికారులతో సమన్వయం చేసుకొని వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
రెండు రోజులుగా తీసుకుంటున్న చర్యలను సిపికి పెద్దపల్లి సారంగపాణి, సిఐలు ప్రదీప్ కుమార్, అనిల్ కుమార్, ఎస్ఐ రాజేష్ లు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement