Saturday, April 20, 2024

తల్లీబిడ్డల క్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం : మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్ : తల్లీబిడ్డల క్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం అని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ఆయన పండ్లు, స్వీట్లు నగర మేయర్, జడ్పీ చైర్ పర్సన్, జిల్లా కలెక్టర్ తో కలసి రోగులకు, బాలింతలకు పంపిణీ చేశారు. వార్డుల్లో కలియతిరిగి అందుతున్న వైద్య సేవలపై బాలింతలను అడిగి తెలుసుకున్నరు. ప్రభుత్వ ఆసుపత్రిలో పెద్ద ఎత్తున వస్తున్న పేషెంట్లకు అందిస్తున్న సేవలపై డాక్టర్లతో మాట్లాడి తీసుకోవ‌లసిన చర్యలపై పలు సూచనలు చేశారు. రజిని అనే మహిళకు ఒకే కాన్పులో ఒక ఆడపిల్ల ఒక మగపిల్లాడు కవల పిల్లలు జన్మించడంతో వారికి రెండు సీఎం కేసీఆర్ కిట్లతో పాటు 5000 రూపాయలను బహుమతిగా మంత్రి అందించారు. సీఎం కేసీఆర్ పిలుపుమేరకు కరీంనగర్ జిల్లాలో వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి పలువురు బాలింతలకు కేసీఆర్ కిట్లను అందజేశాం. మాతా శిశు సంరక్షణ కేంద్రంలోని వైద్య సేవల పట్ల ఇక్కడి బాలింతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రైవేటుకు ధీటుగా కరీంనగర్ లోని మాతాశిశు సంరక్షణ కేంద్రంలో అద్భుతమైన వైద్య సేవలతో ప్రతిరోజు 250 నుండి 300 మంది గర్భిణీ స్త్రీలు చికిత్స కోసం వస్తున్నారని తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా… నాణ్యమైన ప్రభుత్వ వైద్యం కేవలం తెలంగాణలోనే సాధ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, నగర మేయర్ వై సునీల్ రావు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జువేరియా, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ రత్నమాల, డాక్టర్ ఆలీమ్, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement