Thursday, March 28, 2024

రాజీవ్ గాంధీ త్యాగాలు మరువలేనివి

దేశ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ దేశం కోసం చేసిన త్యాగాలు మరువలేనివని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ గౌడ్ అన్నారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… దేశం కోసం రాజీవ్ గాంధీ చేసిన‌ సేవలను కొనియాడారు. ఆయన అందించిన స్ఫూర్తితో ముందుకు సాగుతామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, అనుకునురి బాలరాజు, సుర దేవరాజు, మంగ కిరణ్, వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement