Friday, April 19, 2024

అమ‌రవీరుల త్యాగాలు మ‌రువ‌లేనివి.. మేయర్ యాదగిరి సునీల్ రావు

తెలంగాణ కోసం ఎంతో మంది ప్రాణాలు అర్పించార‌ని వారి త్యాగాలు మ‌రువ‌లేనివ‌ని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు పోలీస్ కిష్టయ్య వర్ధంతి సందర్భంగా నగరంలోని అమర వీరుల స్తూపం వద్ద నగర మేయర్ యాదగిరి సునీల్ రావు పూల మాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో గ్రంథాలయ చైర్మన్ కొన్న అనిల్ కుమార్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడు పెసలు కుమార్ స్వామి, కరీంనగర్ నియోజకవర్గం ఇన్ చార్జి పండుగ నాగరాజు, ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement