Thursday, April 25, 2024

కూర రాజన్నను జైలుకి తరలించిన పోలీసులు

జనశక్తి అగ్రనేత కూర రాజన్నను కరీంనగర్ జైలుకి తరలించారు పోలీసులు. పోలీసులు ఆయనను నిన్న రాత్రి సిరిసిల్ల జడ్జి ముందు ప్రవేశపెట్టారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా కరీంనగర్ జైలుకి కూర రాజన్నను తరలించారు. నిన్న హైదరాబాద్ లో కూర రాజన్నని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా సీపీఐ (ఎంఎల్‌) జనశక్తి నేత కూర రాజన్నను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు అరుణోదయ గౌరవాధ్యక్షురాలు, ప్రజా గాయని విమలక్క తెలిపారు. హైదరాబాద్‌ శివారులోని కౌకూరులో ఓ ఇంట్లో నుంచి బయటికి వస్తుండగా.. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు ఆయన్ని అరెస్ట్‌ చేశారని సోమవారం ఆమె మీడియాకు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement