Friday, April 26, 2024

గంభీరావుపేట ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత..

రాజన్న సిరిసిల్ల : గంభీరావుపేట ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వ‌ద్ద ఉద్రిక్తత వాతావ‌ర‌ణం నెల‌కొంది. వేములవాడ సెస్ ఎన్నికల్లో గంభిరావుపేట మండలం కొత్తపల్లి గ్రామ బ్యాలెట్ బాక్స్ లు సీల్ లేకుండా ఉన్నాయని ఇండిపెండెంట్ అభ్యర్థి, బీజేపీ ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికార పార్టీ జులం నశించాలని కౌంటింగ్ కేంద్రం వద్ద రోడ్ పై బీజేపీ కౌంటింగ్ ఏజెంట్లు ఇండిపెండెంట్ అభ్యర్తి, ఏజెంట్లు ధర్నా చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అభ్యర్థులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేష‌న్ కి త‌ర‌లించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement