Thursday, April 25, 2024

కేసీఆర్‌ సాయం కోసం ప్రైవేటు టీచర్ల దరఖాస్తులు

పెద్దపల్లిరూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు టీచర్లను ఆదుకునేందుకు ప్రకటించిన కెసిఆర్‌ సహాయం కోసం ప్రైవేట్‌ ఉపాధ్యాయుల దరఖాస్తులు అందిస్తున్నారు. ప్రైవేటు- ఉపాద్యాయుల దీన స్థితిని గుర్తించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ. 2 వేలు, 25 కిలోల బియ్యం అందజేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పట్టణంలోని క్రిసెంట్‌ పాఠశాలలో కేసీఆర్‌ సాయానికి టీచర్లు దరఖాస్తు చేసుకున్నారు. ఈకార్యక్రమంలో షబీన్‌, భవాని, శ్రీవాణి, ముజార, సరిత తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement