Friday, April 19, 2024

కరోనాతో ప్రభుత్వ ఉపాధ్యాయుడి మృతి

వేములవాడ: కరోనా మహమ్మారి ఓ ప్రభుత్వ ఉపాధ్యాయున్ని బలితీసుకుంది. వేములవాడ పట్టణానికి చెందిన గుమ్మడి ప్రకాష్‌ (45) గత నాలుగు రోజుల క్రితం కోవిడ్‌ సోకింది. రెండు రోజులుగా ఇంట్లోనే వైద్యం తీసుకుంటు-న్నాడు. సోమవారం రోజున ఆకస్మాత్తుగా ఊపిరి ఆడకపోవడంతో చికిత్స నిమిత్తం కరీంనగర్‌కు తరలించారు. మంగళవారం తెల్లవారు జామున ప్రకాష్‌ మృతిచెందినట్లు- కుటు-ంబ సభ్యులు తెలిపారు. వేములవాడ పట్టణంలో ప్రతిరోజు కోవిడ్‌ మరణాలు పెరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement