Wednesday, April 24, 2024

కష్టపడి చదివితే లక్ష్యసాధన: ట్రినిటీ చైర్మన్

విద్యార్థులు కష్టపడి చదివితే లక్ష్యసాధన వెతుక్కుంటూ వస్తుందని ట్రినిటీ విద్యాసంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో బుధవారం జరిగిన ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల వార్షికోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైnయ్యారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ట్రినిటీ విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థులు ఏ ఒక్కరు కూడా ఖాళీగా ఉండరని అన్నారు. రానున్న నెల రోజుల్లో మెగా ఉద్యోగ మేళా క్యాంపు నిర్వహించి ప్రతి విద్యార్థి ఉద్యోగిగా మారేలా దోహద పడతామన్నారు. దీనికోసం గత కొద్ది మాసాలుగా ఇంజనీరింగ్ కళాశాలలో ఫీల్డ్ ట్రిప్ ఇండస్ట్రియల్ విజిట్ కార్యక్రమాలు నిర్వహించి సాంకేతికపరంగా విద్యార్థులను ఎంతో అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రతి విద్యార్థి పట్టుదలతో చదవాలని కృషి చేయాలని నిరంతర తపనతో ముందుకు సాగాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement