Thursday, April 18, 2024

కేటీఆర్ పర్యటనకు పటిష్టమైన బందోబస్తు.. సిపి సుబ్బారాయుడు

తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పర్యటన సందర్భంగా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసినట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు పేర్కొన్నారు. సోమవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సర్క్యూట్ రెస్ట్ హౌస్ ను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ… మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో పాటు జమ్మికుంటలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సిపి వెంట డిసిపి చంద్రమోహన్ తో పాటు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement