Thursday, April 25, 2024

భద్రత ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు : క‌రీంన‌గ‌ర్ సీపీ

వ్యాపార సముదాయాల్లో భద్రత ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ హెచ్చరించారు. శుక్రవారం నగరంలోని షాపింగ్ మాల్స్ తోపాటు డిమార్ట్, స్పెన్సర్స్ లలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మాల్స్ లో ప్రమాదాల నివారణ కోసం ముందస్తు భద్రత చర్యలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ…. వ్యాపారులు వాణిజ్య సముదాయాల వద్ద పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement