Thursday, April 25, 2024

రైతు సంఘం మండల కన్వీనర్‌గా ‘శ్రీనివాస్‌రెడ్డి’

చిగురుమామిడి: చిగురుమామిడి మండల రైతు సంఘం మండల కన్వీనర్‌గా ఇందుర్తి గ్రామానికి చెందిన కాంతాల శ్రీనివాస్‌రెడ్డిని ఎంపిక చేసినట్లు రైతు సంఘం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా అధ్యక్షులు అందె స్వామి తెలిపారు. ఎంపిక పట్ల సిపిఐ మండల కార్యదర్శి నాగేల్లి లక్ష్మారెడ్డి, ఇందుర్తి సర్పంచ్‌ స్వరూప స్వామి, ఎంపీటీ-సీ అందె స్వప్న చిన్న స్వామి, సింగిల్‌ విండో డైరెక్టర్‌ చాడ శ్రీధర్‌రెడ్డిలు హర్షం వ్యక్తం చేశారు. తనను ఎంపిక చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న రోజుల్లో రైతుల సమస్యలపై నిత్యం పోరాటం చేస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement