Wednesday, March 27, 2024

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి : ఎమ్మెల్యే దాసరి

క్రీడలు మానసికోల్లాసాన్ని పెంపొందిస్తాయని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జూలపల్లి మండలంలోని తెలుకుంట గ్రామంలో కీ. శే. తీగల శ్రీనివాస్ స్మారకార్ధం నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా గ్రామీణస్థాయి క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం ఆయ‌న‌ మాట్లాడుతూ క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్, జడ్పిటిసి లక్ష్మణ్, పెద్దపల్లి ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్, సర్పంచ్ పద్మ శ్యామ్, ఎంపీటీసీ శ్రీనివాస్ ఇతర గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు.. టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement