Thursday, March 28, 2024

శివాలయం చైర్మన్ గా కృష్ణమూర్తి..

పెద్దపల్లి : పెద్దపల్లి పట్టణంలోని శ్రీ మడ్ల రామలింగేశ్వర స్వామి (శివాలయం గుడి) దేవాలయం నూతన కమిటీని నియమించినట్లు పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. ఆలయ చైర్మన్ గా ఇల్లందుల కృష్ణమూర్తి సభ్యులుగా అల్లంకి శ్రీనివాస్, నాళ్ళ విశ్వనాథ్,రాచకట్ల నరసింహస్వామి,కట్ట చంద్రమౌళి,పైడ నరేందర్, పైడ సత్య లక్ష్మీ, పుల్లూరి కృష్ణమూర్తి, పిన్నింటి రాజు వేముల రామ్మూర్తి, నాళ్ళ దక్షిణామూర్తి, బొడ్ల రమేష్,మందల సత్యనారాయణ రెడ్డి లను నియమిస్తూ నియామక పత్రాలు అందించారు. అనంతరం మాట్లాడుతూ నూతన కమిటీ ఆలయ అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు. చైర్మన్ ఇల్లందుల కృష్ణమూర్తి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే దాసరి కి కృతజ్ఞతలు తెలియజేశారు. శివాలయ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, భక్తుల సౌకర్యార్థం పూర్తిస్థాయిలో ఏర్పాటు ఏర్పాటు చేస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement