Monday, March 25, 2024

మద్యం మత్తులో అన్న.. రోకలి బండతో చంపిన చెల్లి

కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. తోడపుట్టిన అన్నను రోకలిబండతో బాది చెల్లి హత్య చేసిన ఘటన జిల్లాలోని విద్యానగర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ వ్యక్తి ఫుల్లుగా మద్యం సేవించి ఇంటికి వెళ్లాడు. అయితే మద్యం మత్తులో ఉన్న అతడు వావివరసలు మరిచి ఎదురుగా కనిపించిన చెల్లెలితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ క్రమంలో తనను తాను కాపాడుకునేందుకు అన్నపై చెల్లెలు రోకలిబండ విసిరింది. అయితే రోకలిబండ తలకు బలంగా తగలడంతో అన్న అక్కడికక్కడే మరణించాడు. కాగా ప్రతిరోజూ మద్యం తాగివచ్చి అన్న తనను వేధిస్తున్నాడని చెల్లెలు ఆరోపించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఈ హత్యపై విచారణ చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement