Friday, April 19, 2024

సింగరేణి అద్భుత ప్రగతిపై సమావేశం..

యైటింక్లయిన్‌కాలనీ: ఆర్జీ2 ఏరియా ఓసీపీ3 కృషి భవన్‌లో జీఎం వెంకటేశ్వర్‌రావు సింగరేణి అద్భుత ప్రగతిపై ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సింగరేణిలో అద్భుత ప్రగతి జరిగిందని తెలిపారు. ఉత్పత్తి, ఉత్పాదతకలో పరుగులు పెడుతున్నామని, ఓసీపీ3 కేటాయించిన లక్ష్యాన్ని చేరుకోవడం పట్ల ఉద్యోగులను అభినందించారు. రక్షణతో కూడిన ఉత్పత్తికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్‌ ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్‌, అధికారులు సాంబయ్య, రాధాకృష్ణారావు, వేణుగోపాల్‌, మురళీకృష్ణ, చంద్రమౌళి, రాజేశ్వర్‌, రాందాస్‌, గబలే, పీవీ రమణ, వేణుగోపాల్‌, సురేందర్‌, పిట్‌ కార్యదర్శి విజేందర్‌రెడ్డిలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement