Sunday, March 24, 2024

కాంగ్రెస్ నేత‌ల మౌన దీక్ష

సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి శిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పుకు నిరసనగా కరీంనగర్ గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ నాయకులు మౌనదీక్ష చేపట్టారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ 2019 పార్లమెంట్ ఎన్నికల సభలో మోడీ గురించి చేసిన ఆరోపణల నేపథ్యంలో సూరత్ కోర్ట్ రాహుల్ గాంధీకి రెండేళ్ల జైల్ శిక్ష విధిస్తూ నిన్న ఇచ్చిన తీర్పును ఖండస్తూ కోతిరాంపూర్ గాంధీ విగ్రహం వద్ద మౌనదీక్ష చేపట్టారు. ఈ దీక్షలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తదితరులు హాజర‌య్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement