Saturday, April 20, 2024

పర్యావరణ రక్షణకు మొక్కలు నాటాలి.. పెద్దపల్లి డిసిపి రూపేష్

పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పెద్దపల్లి డిసిపి చెన్నూరి రూపేష్ పిలుపునిచ్చారు. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వాతంత్య్ర భారత వజ్రోత్సవ మహోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆర్ముడ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఆవరణలో డిసిపి అడ్మిన్ అఖిల్ మహాజన్ తో కలిసి మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసిపి గిరి ప్రసాద్, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి మోహన్, ఏ ఆర్ ఏ సి పి సుందర్ రావు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఆర్ ఐ లు మధుకర్ శ్రీధర్ విష్ణు ప్రసాద్, ఆర్ఎస్ఐలు ప్రవీణ్, ఇతర అధికారులు, ఏఆర్ సిబ్బంది స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొనడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement