Thursday, April 25, 2024

అర్హులందరికి రేషన్‌ కార్డు,పెన్షన్‌, డబుల్‌ బెడ్‌ రూం..

‌వేములవాడ: అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్‌ కార్డు, పెన్షన్,‌ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇవ్వాలని జిల్లా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షులు సంగ స్వామియాదవ్‌ డిమాండ్‌ చేశారు. వేములవాడ పట్టణంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ గతంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన రేషన్‌ కార్డు తప్ప కొత్తగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇచ్చింది ఏమీ లేదన్నారు. కొట్లాడి తెచ్చుకున్న టు-వంటి తెలంగాణలో మన నిధులు నియామకాలు ఎటు- పోయాయని ప్రశ్నించారు. కెసిఆర్‌ ప్రభుత్వంలో సామాన్య ప్రజలు లబ్ధి పొందింది ఏమి లేదన్నారు. వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేనియెడల ప్రజల పక్షాన ఉండి పోరాడుతామని ఆయన హెచ్చరించారు. ఆయన వెంట కాంగ్రెస్‌ నాయకులు చంద్రగిరి శ్రీనివాస్‌ గౌడ్‌, లింగంపల్లి కిరణ్‌, కనికరపు రాకేష్‌, గుడిసె కర్ణాకర్‌, కొలకని రాజు, వస్తాదు కృష్ణ, తంగెళ్ల గణష్‌, గెంటియాల ప్రకాష్‌, పల్లకొండ అమర్‌, తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement