Wednesday, April 17, 2024

మృతుల కుటుంబాలకు రూ.14 లక్షల నష్టపరిహారం : ఎమ్మెల్యే దాసరి

రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొని ముగ్గురు మృతిచెందారని బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మృతుల కుటుంబాలను పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఆస్పత్రి వద్ద పరామర్శించి ఓదార్చారు. అనంతరం కాంట్రాక్టర్ తో ఐదు గంటల పాటు సుధీర్ఘంగా చర్చించి పెద్దకల్వల, సుల్తానాబాద్ కు చెందిన మృతులు పెగడ శ్రీనివాస్, వేణుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.13.50 లక్షల నష్టపరిహారం, దహన సంస్కారాలకు రూ.50 వేలు ఇచ్చేలా ఒప్పించామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement