Wednesday, April 24, 2024

పేద కుటుంబానికి చిరు వ్యాపారుల చేయూత..

కాల్వశ్రీరాంపూర్‌: మండలంలోని మల్యాలకు చెందిన కంది శ్రీనివాస్‌ అనే నిరుపేద యువకుడు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా అతని కుటుంబానికి కూరగాయలు విక్రయించే చిరు వ్యాపారులు చేయూతనందించారు. శ్రీనివాస్‌ కుటుంబానికి రూ. 16500 ఆర్థికసాయం అందించి మానవీయ దృక్పథాన్ని చాటుకున్నారు. తలా కొంత పోగు చేసిన ఆర్థికసాయం చేసిన చిరు వ్యాపారులను పలువురు అభినందించారు. ఈకార్యక్రమంలో బర్ల తిరుపతి, ఆకుల రవి, అనిల్‌, సాయి, భరత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement