Thursday, March 28, 2024

రోడ్లు, డ్రైనేజీ సమస్యలు..

ఎన్‌టీపీసీ: మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 3వ డివిజన్‌ అన్నపూర్ణ కాలనీలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎరవెల్లి ముత్యంరావు డిమాండ్‌ చేశారు. సిపిఎం ఎన్టిపిసి జోన్‌ కమిటీ- ఆధ్వర్యంలో అన్నపూర్ణ కాలనీ అంబేద్కర్‌ భవన్‌ ఎదుటు ఉన్న మూడు గల్లి రోడ్లను సిపిఎం పార్టీ బృందం పరిశీలించింది. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించడంలో మున్సిపల్‌ అధికారులు విఫలమయ్యారని, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం అస్తవ్యస్తంగా తయారైందన్నారు. మురుగునీరు రోడ్ల పైకి చేరి కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామాచారి, నాంసాని శంకర్‌, గీట్ల లక్ష్మారెడ్డి, రవీందర్‌, మల్లేష్‌, కృష్ణారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, దండ రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement