Tuesday, March 26, 2024

జ్యోతిబా పూలే గురుకులంలో రక్షా బంధన్ వేడుకలు… హాజరైన ఎమ్మెల్యే దాసరి

మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకులంలో రక్షా బంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం గురుకులంలో విద్యార్థులు ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కటౌట్ లకు రాఖీలు కట్టిన అనంతరం పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాఖీ పండుగ ఎంతో విశిష్టమైనదని, అక్క చెల్లెలు తమ్ముడికి గాని అన్నకు గాని రాఖి కట్టిన తదుపరి వారికి అండగా భరోసాగా ఉంటానని ధైర్యం అందించడం జరుగుతుందన్నారు. అదే విధంగా తెలంగాణలోని ఆడపడుచుల అందరికీ కేసీఆర్, కేటీఆర్ లు ఒక అన్నలా, ఇంటి పెద్దలా గా భరోసా కల్పిస్తున్నారాన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ నాజ్మినా సుల్తాన్ మోబిన్ వార్డు కౌన్సిలర్లు పూదరి చంద్రశేఖర్, పైడా పద్మ రవి, పెంచాల శ్రీధర్, నాయకులు అక్కపాక తిరుపతి, వెన్నం రవి, కాశిపాక వాసు, పల్లె మధు, తాళ్ల కళ్యాణ్, గొట్టే ముక్కుల శ్రీనివాస్ , కుక్క ప్రేమ్, చిట్టి బాబు లతో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement