Thursday, April 25, 2024

బండి సంజ‌య్ పాద‌యాత్ర‌లో పాల్గొన్న దివ్యాంగుడు..

బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ప్రారంభించిన‌ ప్ర‌జా సంగ్రామ యాత్ర ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలో కొన‌సాగుతోంది. బండి సంజయ్ ను చూసేందుకు దివ్యాంగుడు రాజు జహీరాబాద్ నుండి కొండగట్టు సమీపంలోని పాదయాత్ర శిబిరం వద్దకు వ‌చ్చాడు. తనకు రెండు కాళ్లు లేనప్పటికీ బండి సంజయ్ తో కలిసి పాదయాత్ర చేస్తాన‌ని రాజు కోరాడు. బండి సంజయ్ కు తాను వీరాభిమానని, సంజయన్నతో కలిసి పాదయాత్ర చేస్తానని రాజు భీష్మించి కూర్చున్నాడు. దీంతో కాసేపట్లో కొండగట్టు వద్ద నుండి బండి సంజయ్ తో కలిసి పాదయాత్ర చేసేందుకు రాజు సిద్ధ‌మ‌య్యాడు. అక్క‌డి నుంచి పాద‌యాత్ర కొన‌సాగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement