Tuesday, April 16, 2024

ఎం ఈఓ మృతికి అధికారుల శ్రద్ధాంజలి..

ఎల్లారెడ్డిపేట: మండల విద్యాధికారిగా 17 ఏళ్ల పాటు పనిచేసి కరోనాతో మరణించిన ఎం ఈఓ రాజయ్యకు ఎల్లారెడ్డి పేట తహశీల్దార్‌ శ్రీకాంత్‌, ఎంపీడిఓ చిరంజీవి ఆధ్వర్యంలో అధికారులు, ఉపాధ్యాయులు ఎమ్మార్సీ భవనంలో శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన అకాల మరణానికి చింతించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి,ఆంగ్ల మాధ్యమం ప్రవేశంతో విద్యలో పలు సంస్కరణలు తీసుకు వచ్చి రాష్ట్రపతి అవార్డు పొందిన గొప్ప విద్య వేత్త రాజయ్య అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్‌ ఉద్యోగులు, పంచాయతీ కార్యదర్శులు, డిప్యూటీ తహశీల్దార్‌ జయంత్‌, ఎంపీఓ వజీర్‌లు పాల్గొన్నారు. అలాగే బొప్పా పూర్‌ జ్ఞానదీప్‌ పాఠశాల ఆవరణలో ఎంఈఓ రాజయ్య, వెంకటాపూర్‌ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ఓలాద్రి యాదగిరిరెడ్డి మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ బాల్‌ రెడ్డి, ఏఎంసీ చైర్మెన్‌ కొండ రమేష్‌ గౌడ్‌, టీఆర్ ఎస్ మండల అధ్యక్షుడు వర్స కృష్ణహరి, కరస్పాండెంట్‌ మిట్టపల్లి లక్ష్మి నారాయణ, ఉపాధ్యాయులు పాల్గొని వారి చిత్రపటాలకు పూలమాలలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిఐ చంద్రశేఖర్‌, ప్రభుత్వ ఉపాద్యాయులు సంపత్‌, యస్‌పాల్‌, భానుతో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement