Thursday, April 25, 2024

భావి తరాలకు పూలే ఆదర్శం..

పెద్దపల్లిరూరల్‌: భావితరాలకు మహాత్మ జ్యోతిబా పూలే ఆదర్శమని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పాత కోర్టు చౌరస్తా వద్ద జ్యోతిబాపూలే విగ్రహ ఏర్పాటు కోసం ఎమ్మెల్యే దాసరి భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘ సంస్కర్తగా జ్యోతిబా పూలే దంపతులు సమాజానికి చేసిన సేవలు వెలకట్టలేనివన్నారు. పూలే మార్గాలను భావి తరాలు అనుసరించి ముందుకు సాగాలన్నారు. నేటి యువత పూలేను స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆశయసాధనకు కృషి చేయాలన్నారు. జిల్లా కేంద్రంలో మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయడం ద్వారా రానున్న తరాలకు వారి జీవిత చరిత్రను తెలిపే వీలుంటుందన్నారు. ఈకార్యక్రమంలో కౌన్సిలర్లు నూగిళ్ల మల్లయ్య, లైసెట్టి భిక్షపతి, కో- ఆప్షన్‌ సభ్యుడు ఫహీమ్‌, మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ జడల సురేందర్‌, నాయకులు పెంచాల శ్రీధర్‌, అక్కపాక తిరుపతి, కుంభం సంతోష్‌, బెక్కం ప్రశాంత్‌, నూనె పరమేశ్వర్‌, భూతగడ్డ అజయ్‌, సుభాష్‌, పోసాని శ్రీనివాస్‌యాదవ్‌, బొడ్డుపల్లి శ్రీనివాస్‌, దేవనంది నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement