Thursday, April 25, 2024

విధ్వంసం సృష్టించేందుకు రెచ్చగొట్టే వ్యాఖ్యలు .. బండి సంజయ్ పై గంగుల ఫైర్

రాష్ట్రంలో విధ్వంసం సృష్టించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… తెలంగాణ ప్రజలు విధ్వంసాన్ని కోరుకోరని, అభివృద్ధిని కాంక్షిస్తారన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో మత కలహాలు లేకుండా లా అండ్ ఆర్డర్ అదుపులో ఉందని, బండి సంజయ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలతో విధ్వంసాన్ని సృష్టించేందుకు యత్నిస్తున్నారన్నారు. మతకలహాలు ఉన్న ప్రాంతం అభివృద్ధికి నోచుకోదని ఇందుకు గుజరాత్ నిదర్శనంగా నిలుస్తోందన్నారు. అందుకే ఇక్కడికి ప్రపంచ స్థాయి కంపెనీలు రావడం లేదని, బండి సంజయ్ గడ్డపారతో తవ్వడం కాదు నిధులు తెచ్చి అభివృద్ధి చేయాలన్నారు. బండి మతకలహాలకు ఆజ్యం పోయడం మానుకుని, తాను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాము అభివృద్ధి చేసి ఓట్లు అడిగితే బండి సంజయ్ మత ప్రాతిపాదికన ఓట్లు అడిగేందుకు యత్నిస్తున్నారన్నారు. పరమతాలను గౌరవించడం నేర్చుకోవాలని, రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. ఇంకో మతం గురించి మాట్లాడడం ఏ మతం ఒప్పుకోదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement