Thursday, April 25, 2024

గులాబీ శ్రేణుల నిరసన..

టీఆర్‌ఎస్‌ (బీఆర్‌ఎస్‌) పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాలకు ప్రయత్నించి ప్రభుత్వాన్ని కూల్చే కుట్రచేసిన బీజేపీ పార్టీ నీచపనికి నిరసనగా మంత్రి గంగుల కమలాకర్‌ ఆదేశాల మేరకు గురువారం తెలంగాణ చౌక్‌లో టీఆర్‌ఎస్‌(బీఆర్‌ఎస్‌) పార్టీ నాయకులు, నగర మేయర్‌ వై.సునీల్‌ రావు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి.. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయం చైర్మన్‌ అనిల్‌, టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement