Thursday, April 25, 2024

రాజన్న భక్తులకు కరోనా నుండి రక్షణ .. 20వేల మాస్కులఅందజేత..

వేములవాడ (ప్రభా న్యూస్) : దక్షిణ కాశీగా విరాజిళ్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి విచ్చేస్తున్న భక్తులకు కరోనా బారిన పడకుండా రక్షించేందుకు వేములవాడ పట్టణానికి చెందిన భాను ఏజెన్సీ సంస్థల అధినేత నగుబోతు రవీందర్ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా 20 వేల మాస్క్ లు , 600 వందల లీటర్ల సానిటాయిజర్లు సుమారు 80 వెల రూపాయిల విలువగలవి ఈఓ రమాదేవి కి అందజేశారు. గతంలో భాను ఏజెన్సీ సంస్థ నుండి నగుబోతు రవీందర్ మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు మజ్జిగ ప్యాకెట్లు ,తాగునీటి సౌకర్యం ,శానిటేషన్ సంబంధించిన పరికరాలను అందించేవారు. సామాజిక కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందు వరుసలో వుండే సామాజిక కార్యకర్త నగుబోతు రవీందర్ కు ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఈ రాజేష్,ఏఈఓ ప్రతాప నవీన్ ,పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు,హరిహర్నథ్, ఎల్ రాజేందర్ ,ఎడ్ల శివ ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement