Wednesday, April 24, 2024

విద్యార్థులకు ప్రేరణా-2023.. 3న లక్ష మందితో సదస్సు..

ప్రేరణా-2023 పేరుతో యువతకు కరీంనగర్ పోలీసులు దిశా నిర్దేశం చేయనున్నారు. బుధవారం కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు మీడియాకు వివరాలు అందించారు. యువత పెడదారి ప‌ట్టకుండా క్రైంని అరికట్టేందుకు కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ఈ నెల 3న లక్ష మంది విద్యార్థులతో సదస్సు నిర్వహించనున్నారు. గంజాయి, డ్రగ్స్ మొబైల్ అప్లికేషన్ మోసాలు, ఆన్ లైన్ బ్యాంకింగ్ వీటన్నిటినీ ఎలా ఎదుర్కోవాలో తెలిపేందుకు విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు.
అన్ని కళాశాలల విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు. ఈ అవగాహన కార్యక్రమానికి సినీ హీరో రాజేంద్ర ప్రసాద్, ప్ర‌ముఖ ర‌చ‌యిత‌, మోటివేట‌ర్ వీరేంద్రనాథ్ లు హాజరుకానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement