Friday, March 29, 2024

కాంట్రాక్టు కార్మికులకు పీఆర్సీ అమలు చేయాలి

పెద్దపల్లి: కాంట్రాక్టు కార్మికులందరికి తెలంగాణ ప్రభుత్వం పీఆర్సీని అమలు చేయాలని ఇఫ్టూ రాష్ట్ర అధ్యక్షుడు ఆకుల వెంకన్న, జిల్లా అధ్యక్షుడు ఈదునూరి నరేశ్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఇఫ్టూ అనుబంధ సింగరేణి కాలరీస్‌ కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా 30 వేల మంది కాంట్రాక్ట్‌ కార్మికులు వివిధ విభాగాల్లో పర్మినెంట్‌ కార్మికులతోపాటు- పనిచేస్తున్నార ని, యాజమాన్యం అతి తక్కువ వేతనాలు ఇస్తూ శ్రమను దోచుకుంటు-ందన్నారు. ఇటీ-వల రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు, ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వం పిఆర్సి ప్రకటించిందని, సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరికీ పీఆర్సీ అమలు చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి తోకల రమేష్‌, రామగుండం రీజియన్‌ ప్రధాన కార్యదర్శి బి. అశోక్‌, సుద్దాల మనోజ్‌, కాంపెళ్లి మల్లేష్‌ నేరేల్ల సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement