Friday, April 19, 2024

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుదాం..

పెద్దపల్లి: కార్మిక వ్యతిరేక లేబర్‌ కోడ్స్‌ ఉపసంహరణ, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులంతా మేడేను జరుపుకుంటూ పోరాటం చేయాలని ఇఫ్టూ జిల్లా అధ్యక్షుడు ఈ. నరేశ్‌ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో ఇఫ్టూ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కార్మిక వ్యతిరేక కోడ్‌లు రద్దయ్యే వరకు ఉద్యమిద్దామన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలపై ప్రజల ఆస్తులు, కార్మికుల హక్కుల రక్షణకై పోరాటం చేయాలన్నారు. పెట్టుబడిదారులకు దేశాన్ని తాకట్టు పెట్టే పాలకుల వైఖరిని ఎండగట్టాలన్నారు. మేడేను విజయవంతం చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో నాయకులు లింగమూర్తి, వేల్పుల అంజయ్య, శ్యామ్‌, ఓదెలు, శ్రీనివాస్‌, రాములు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement