Saturday, April 20, 2024

ప్రైవేటు టీచర్లకు బియ్యం..

ముత్తారం: మండలంలోని కేశన్‌పల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు టీచర్లకు 25 కిలోల బియ్యం, రూ. 2వేల నగదును సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు నూనె కుమార్‌ పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన బందెల సతీష్‌, పంచాల కృష్ణమూర్తికి ప్రభుత్వ సాయాన్ని అందించారు. లక్కారం గ్రామంలో సర్పంచ్‌ అత్తె లలిత చంద్రమౌళి ఆధ్వర్యంలో ప్రైవేటు టీచర్లకు బియ్యం పంపిణీ చేశారు. కరోనా పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని వారు కోరారు. ఈకార్యక్రమంలో ఎంపిటిసి రామగళ్ల పోచమ్మ మధుకర్‌, సింగల్‌ విండో డైరెక్టర్‌ గిరి విరేందర్‌, ఉపసర్పంచ్‌ తాత స్వప్న బాలు, వార్డుసభ్యులు చుంచు రమేష్‌, రేషన్‌ డీలర్‌లు ఎన్‌రెడ్డి ప్రభాకర్‌, గడ్డం సుజాత సదన్‌, నాయకులు రాగుల రాజయ్య, చిందం సదానందం, మాజీ సర్పంచ్‌ జక్కుల ఓదెలు, యాకూబ్‌, సింగనవేన కుమార్‌, మాదాసి రమేశ్‌, బర్ల కొమురయ్య, వీరగోని సారయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement