Saturday, April 20, 2024

ప్రైవేటు ఉపాధ్యాయులకు ప్రభుత్వ సాయం..

ముత్తారం: రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు ఉపాధ్యాయులకు ప్రకటించిన రూ. 2వేల సాయం, 25 కిలోల బియ్యాన్ని మండలంలోని అడవిశ్రీరాంపూర్‌ గ్రామంలో సర్పంచ్‌ తుంగాని సమ్మయ్య యాదవ్‌ పంపిణీ చేశారు. జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు ఆదేశాల మేరకు ఈ సాయం అందించినట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో సర్పంచ్‌తోపాటు ఉపసర్పంచ్‌ మద్దెల దేవకర్‌, ఎంపీటీసీ దొడ్డ గీతారాణి బాలాజీ, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement