Tuesday, April 23, 2024

కౌలు రైతు కుటుంబాన్ని ఆదుకోవాలి..

ఎల్లారెడ్డిపేట: మండలంలోని వెంకటాపూర్‌ గ్రామంలో ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతు ఎమ్మా ప్రభాకర్‌ కుటుంబాన్ని ఆదుకోవాలని మండల కాంగ్రెస్‌ అధ్యక్షులు దోమ్మటి నర్సయ్య డిమాండ్‌ చేశారు. ప్రభాకర్‌ 10 ఎకరాల భూమిలో వరి పంటను సాగు చేయగా పూర్తిగా ఎండిపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. కౌలు రైతు భార్యా బిడ్డలను ప్రభుత్వం ఆదుకోవాలని, రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించి కుటుంబలంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నర్మల ప్రాజెక్టులో నీటిని మానేరు పరివాహక ప్రాంతానికి వదిలిపెట్టాలని, లేకుంటే మానేరు నది పరివాహక ప్రాంతం వరి పంట పూర్తిగా ఎండి పోతుందన్నారు. ఈ సమావేశంలో నాయకులు ఎస్కే గౌస్‌, సద్ది లక్ష్మారెడ్డి, పందిళ్ళ లింగం గౌడ్‌, రాజు నాయక్‌, మర్రి శ్రీనివాస్‌రెడ్డి, కరికె శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement